ప్రేమపెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి

ప్రేమపెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. కూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని తండ్రే గోంతు కోసి చంపిన ఘటన దౌసా జిల్లాలో జరిగింది. స్థానికంగా నివసించే శంకర్ లాల్ సైనీ కూతురు 19 ఏళ్ల పింకీ.. రోషన్ అనే దళిత యువకుడిని ప్రేమించింది. అయితే రోషన్‌తో పెళ్లి చేయడానికి శంకర్ ఇష్టపడలేదు. దాంతో పింకీ ఫిబ్రవరి 16న ఇంటి నుంచి వెళ్లిపోయి రోషన్‌ని పెళ్లిచేసుకుంది. కూతురు చేసిన పనికి ఆగ్రహానికి లోనైన శంకర్.. తన కూతురును రోషన్ కిడ్నాప్ చేశాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పెళ్లి చేసుకున్న మూడు రోజుల తర్వాత పింకీ ఫిబ్రవరి 21న ఊరికి తిరిగి వచ్చింది. రోషన్ ఇంటినుంచి పింకీని ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. పెళ్లి విషయమై తండ్రీ కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. కోపానికి లోనైన శంకర్ లాల్.. కత్తితో పింకీ గొంతు కోసి చంపాడు. కుమార్తెను చంపిన వెంటనే శంకర్ లాల్ నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడని సీనియర్ పోలీసు అధికారి దీపక్ కుమార్ తెలిపారు.
సైనీని అదుపులోకి తీసుకున్నామని, అతనిపై కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదైందని ఆయన తెలిపారు.