తల్లీబిడ్డల సంరక్షణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కె.లక్ష్మణ్

తల్లీబిడ్డల సంరక్షణే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం : కె.లక్ష్మణ్

ఘట్ కేసర్, వెలుగు :  తల్లీబిడ్డల సంరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు ఆర్థిక, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం పోచారం మున్సిపాలిటీ పరిధి బస్తీ దవాఖానలో న్యూట్రీషియన్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలకు ప్రధాని మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అన్నిరంగాల్లో భాగస్వాములను చేసినట్లు పేర్కొన్నారు.  

యుద్ధ విమానాల్లో 15 శాతం సీట్లు, ట్రిపుల్ తలాక్​ చట్టం రద్దు, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కేటాయించి ప్రాధాన్యతనిచ్చారని గుర్తుచేశారు. మరోసారి మహిళలు ఆశీర్వదించి మోదీని ప్రధానిని చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుదర్శన్ రెడ్డి, నేతలు గొంగళ్ల మహేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.