పశ్చిమ బెంగాల్ తాత్కాలిక గవర్నర్‌గా లా గణేశన్

పశ్చిమ బెంగాల్ తాత్కాలిక గవర్నర్‌గా లా గణేశన్

పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగ్‌దీప్ ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు.  ఈ విషయాన్ని  రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ను బీజేపీ శనివారం ప్రకటించడంతో ఆయన ఇవాళ (జులై 18న) మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.  జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఇవాళ ధన్‌కర్ నామినేషన్ వేయనున్నారు.

జగ్‌దీప్ ధన్కర్  రాజీనామా చేయడంతో పశ్చిమ బెంగాల్ కు తాత్కాలిక గవర్నర్‌గా లా. గణేశన్ ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రకటించారు. గణేశన్ ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్నారు.  2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ధన్కర్ నియమితులయ్యారు.  అటు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వాను పోటీలో నిలిపారు. మంగళవారం అల్వా నామినేషన్ దాఖలు చేయనున్నారు.   

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6, 2022న జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10, 2022న ముగుస్తుంది.