మైలార్‌దేవ్‌పల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

మైలార్‌దేవ్‌పల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ మండలం, మైలార్‌దేవ్‌పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఇరు పార్టీల నాయకులు ఘర్షణ ప‌డ్డారు. దుర్గానగర్‌లో రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లారు కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డి కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమైంది. దీనిపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో గతంలో కూడా టీఆర్ఎస్ కార్యర్తలపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడిన ఉదంతాలు వున్నాయి.