ముంబయి: బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ బుల్లితెర ఎంట్రీ చేయనాలని నిర్ణయించుకున్నాడు. కలర్స్ టీవీ ప్రసారం చేయనున్న ఓ క్విజ్ షోను రణవీర్ సింగ్ హోస్ట్ చేయనున్నారు. ‘ద బిగ్ పిక్చర్’ పేరుతో ప్రోమో కూడా రెడీ అయింది. దీనికి సంబంధించి డీల్ పూర్తయింది. బైజూస్ సమర్పణలో ఈ షో కలర్స్ టీవీలో ప్రసారం అవుతుంది. అదే గ్రూప్నకు చెందిన వూట్, జియో ఓటీటీలో లైవ్ ప్రసారమౌతుందని బాలీవుడ్ వర్గాల కథనం.
ప్రత్యేక... ప్రేక్షకులు కూడా ఈ షోలో ఇందులో పాల్గొనవచ్చు. అయితే పాల్గొనాలనుకునేవారు 12 ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలన్నీ దృశ్యా ఆధారంగా ఉంటాయి. గెలిచిన వారికి భారీ బహుమతి ఇవ్వనున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి తరహాలో క్విజ్లో పాల్గొన్నవారికి మూడు లైఫ్లైన్లు కూడా ఉంటాయి. యువతలో రణవీర్కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ మొత్తానికి కలర్ ఈ డీల్ను ఓకే చేసినట్లు సమాచారం.