ముగ్గురు మైనర్ బాలికల రేప్.. నిందితుడికి యావజ్జీవం

ముగ్గురు మైనర్ బాలికల రేప్.. నిందితుడికి యావజ్జీవం

కరీంనగర్ జిల్లాలో 2014లో ముగ్గురు మైనర్ బాలికలను లైంగికంగా లోబర్చుకుని అత్యాచారం చేసిన కేసులో తీర్పు వెలువడింది. కరీంనగర్ జిల్లా ఫస్ట్ అడిషనల్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసులో తీర్పు చెప్పారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.

చొప్పదండి దగ్గర్లోని ఓ ఇటుక బట్టీ యజమాని అయిన లింగంపల్లి కిషన్ ఈ కేసులో నిందితుడు. బతుకు దెరువుకోసం వలస వచ్చిన ఒడిషా వాసులు ఈ కేసులో బాధితులు. ముగ్గురు మైనర్ బాలికలను లైంగికంగా వేధించి అత్యాచారం చేశాడంటూ కిషన్ పై 2014లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణల తర్వాత.. నిందితుడు కిషన్ ను దోషిగా నిర్ధారించిన కరీంనగర్ జిల్లా ఫస్ట్ అడిషనల్ కోర్టు జడ్జి… యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు.