రేషన్ కు కొత్త రూల్.. మీ సేవా కేంద్రాల వద్ద భారీ క్యూ

రేషన్ కు కొత్త రూల్.. మీ సేవా కేంద్రాల వద్ద భారీ క్యూ

వికారాబాద్ జిల్లా పరిగిలో మీ సేవ కేంద్రాల దగ్గర రేషన్ వినియోగదారులు బారులు తీరారు.రేషన్ బియ్యం తీసుకోవాలంటే ఇక నుంచి ఆధార్ కు ఫోన్ లింక్ ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మండలానికి ఒకటి, పరిగి లాంటి పట్టణాల్లో మూడు కేంద్రాలకు ఆధార్ కు ఫోన్ లింకు చేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో రేషన్ వినియోగదారులు మీ సేవ కేంద్రాలకు క్యూకట్టారు. అయితే ఫీజు ఎంత ఇవ్వాలని అధికారులు చెప్పడం లేదు. కొందరు 45రూపాయలు వసూల్ చేస్తే..మరికొందరు 100 నుంచి 150 రూపాయల వరకు తీసుకుంటున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కేంద్రాలకు వెళ్లకుండా మొబైల్ ఫోన్ లోనూ ఆధార్ తో సెల్ ఫోన్ లింక్ చేసుకోవచ్చని నిర్వహకులు చెబుతున్నారు.