IND vs ENG 2025: ఆ రెండు స్థానాలపై సందిగ్ధత: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. రవిశాస్త్రి ప్లేయింగ్ 11 ఇదే!

IND vs ENG 2025: ఆ రెండు స్థానాలపై సందిగ్ధత: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్.. రవిశాస్త్రి ప్లేయింగ్ 11 ఇదే!

జూన్ 20 నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య ప్రారంభం కానున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. 2025-2027 టెస్ట్ సైకిల్ లో భాగంగా ఇరు జట్లకు ఇదే తొలి సిరీస్. ఇప్పటికే ఇరు జట్లు లీడ్స్ చేరుకొని తొలి టెస్ట్ గెలుపే లక్ష్యంగా ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్నాయి. శుక్రవారం (జూన్ 20) లీడ్స్ వేదికగా హెడ్డింగ్లీ వేదికగా జరగనున్న ఈ టెస్టులో ఇంగ్లాండ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు టీమిండియా పూర్తిగా యంగ్ స్టార్లతోనే బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ లాంటి పిచ్ లపై భారత యువ జట్టుకు అతి పెద్ద సవాలుగా మారనుంది. కనీసం ఇంగ్లాండ్ కు పోటీ అయినా ఇస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ | Women's T20 World Cup 2026 schedule: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్.. 2026 మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ఈ సంగతి పక్కన పెడితే ఈ మ్యాచ్ లో భారత్ ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లాండ్ తో టీమిండియా ఆడబోయే తన జట్టును ప్రకటించాడు. శాస్త్రి తన జట్టులో 5 గురు బ్యాటర్లు.. ఒక వికెట్ కీపర్.. ఇద్దరు ఆల్ రౌండర్లు.. ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్లను ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా జైశ్వాల్ తో పాటు రాహుల్ ను ఎంచుకున్నాడు. మూడో స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కాకుండా సూపర్ ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇచ్చాడు.

కోహ్లీ స్థానంలో నాలుగో స్థానంలో గిల్ ఆడాల్సిందిగా సూచించాడు. 8 ఏళ్ళ తర్వాత భారత జట్టులోకి ఎంపికైన కరుణ్ నాయర్ ను ఐదో స్థానానికి ఎంపిక చేశాడు. వికెట్ కీపర్ గా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో ఆడనున్నాడు. స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను సెలక్ట్ చేశాడు. ఎనిమిదో స్థానంలో శాస్త్రి ఎటూ తేల్చుకోలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్, నితీష్ రెడ్డి మధ్య ఎంపిక కష్టతరమైనదని తెలిపాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో పాటు శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంటాను. అని చెప్పిన శాస్త్రి.. నితీష్ 12 నుంచి 14 ఓవర్లు  బౌలింగ్ చేసినట్టయితే అతనికి ఛాన్స్ ఇస్తానని అన్నాడు. 

బౌలింగ్ అటాక్ విషయానికి వస్తే.. లీడ్స్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు పేసర్లు ఉండాలని శాస్త్రి చెప్పాడు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలను ఎంపిక చేశాడు. ఒకవేళ లీడ్స్‌లో వాతావరణం మేఘావృతంగా ఉంటే, మేనేజ్‌మెంట్ ప్రసిద్ కృష్ణ కంటే అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్ ఇవ్వాలని తన అభిప్రాయాన్ని చెప్పాడు. 2007లో చివరిసారిగా టీమిండియా ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.