
కోయంబత్తూర్: టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించాడు. సహనం కోల్పోయి మహిళా అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తన ఔట్ విషయంలో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయమే ఇందుకు కారణమైంది. దిండిగల్ డ్రాగన్స్ తరఫున ఆడుతున్న అశ్విన్ను ఆదివారం రాత్రి తిరుప్పూర్ జట్టుతో మ్యాచ్లో అంపైర్ కృతిక అతడిని ఎల్బీగా ప్రకటించింది. అయితే, టీవీ రీప్లేలో ఆ నిర్ణయం తప్పని స్పష్టంగా తేలింది.
కానీ, అప్పటికే తమ టీమ్ రెండు రివ్యూలను వాడేయడంతో డీఆర్ఎస్ కోరే అవకాశం అశ్విన్కు లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అశ్విన్.. అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత మైదానం వీడుతూ తన కోపాన్ని ఆపుకోలేక బ్యాట్ను ప్యాడ్స్కు కొట్టుకుని, చేతి గ్లోవ్స్ను ఫ్యాన్స్ వైపు విసిరికొట్టాడు. డగౌట్లో కూర్చున్న తర్వాత కూడా అంపైర్ను చూస్తూ తీవ్ర ఆగ్రహంతో తిడుతున్నట్టు కనిపించాడు. అంత సీనియర్ ఆటగాడైన అశ్విన్ ఇలా చేయడంతో గ్రౌండ్లో ఉన్నవాళ్లంతా షాకయ్యారు. అశ్విన్పై చర్యలు తీసుకున్న రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించాడు.