ఢిల్లీపై ముంబై గెలుపుతో ఆర్సీబీ సంబరాలు

ఢిల్లీపై ముంబై గెలుపుతో ఆర్సీబీ సంబరాలు

ఢిల్లీపై ముంబై గెలుపుతో ఆర్సీబీ సంబరాలు చేసుకుంది. ముంబై గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ ఏకంగా పూజలే చేశారు. నిన్న డ్రెస్సింగ్ రూంలో బెంగళూరు ఫ్రాంచైజర్స్ మొత్తం కలిసి మ్యాచ్ ను చూశారు. బాల్ బాల్ కి ఉత్కంఠ.. ముంబై గెలవాలని స్ట్రాంగ్ గా కోరుకున్నారు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి ఖలీల్ నో బాల్ వేయగా.. ఫ్రీ హిట్ ను ఫోర్ బాదిన రణ్ దీప్ ముంబైకి విక్టరీ అందించాడు. దీంతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న కోహ్లీ తో సహా.. కెప్టెన్ డూప్లెసిస్ ఎగిరి గంతేశారు. ముంబై గెలుపుతో బెంగళూరు నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ నెల 25 న ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోతో బెంగళూరు తలపడనుంది.