IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ విన్నర్ ఆర్సీబీ: జోస్యం చెప్పిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్

IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ విన్నర్ ఆర్సీబీ: జోస్యం చెప్పిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్

ఐపీఎల్ 18వ సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్‎లో మరో మూడు మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. క్వాలిఫయర్ 1లో పంజాబ్‎పై అద్భుత విజయం సాధించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‎కు దూసుకెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టుతో పంజాబ్ తలపడనుంది. క్వాలిఫయర్ 2లో విజయం సాధించిన జట్టు ఫైనల్లో ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ  నేపథ్యంలో 2025 ఐపీఎల్ ట్రోఫీ గెలిచే జట్టేదో ఆసీస్ మాజీ స్టార్ క్రికెటర్ షేన్స్ వాట్సన్ జోస్యం చెప్పాడు.

 2025 ఐపీఎల్ టైటిల్ విజేతగా ఆర్సీబీ నిలుస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్ మ్యాచులో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‎గా నిలుస్తాడని వాట్సన్ అంచనా వేశాడు. ఐపీఎల్ టైటిల్ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తోన్న ఆర్సీబీకి.. ట్రోఫీ గెలిచేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.  ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఫ్లే ఆఫ్స్‎కు తిరిగి రావడం జట్టుకు ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉందని పేర్కొన్నారు. 

ALSO READ | RCB vs PBKS Qualifier 1: ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్లిన RCB.. క్వాలిఫయర్ 1లో పంజాబ్‌ చిత్తు చిత్తు

‘‘నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నా. ఐపీఎల్ 2025 విజేత ఆర్‌సీబీ. ఫైనల్ మ్యాచులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని వరిస్తుంది. ఐపీఎల్ టైటిల్ గెలవడానికి ఆర్‌సీబీకి ఇదే సరైన సమయమని నా అభిప్రాయం. టోర్నీ చివరిలో జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ప్లేఆఫ్స్‌కు తిరిగి రావడంతో ఈ సారి ట్రోఫీ ఆర్సీబీదే అనే భావన కలుగుతుంది’’ అని తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్‌లో షేర్ చేసిన వీడియోలో వాట్సన్ జోస్యం చెప్పాడు. మరీ ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ విజేత ఎవరో తెలియాలంటే జూన్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.