
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం (మే 29) జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. చండీఘర్ వేదికగా ముల్లన్పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ లో దుమ్ములేపిన ఆర్సీబీ.. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఎలాంటి తడబాటు లేకుండా ఛేజ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ఛేజింగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్ లో గెలిచిన బెంగళూరు ఫైనల్లోకి అడుగుపెట్టగా.. పంజాబ్ ఆదివారం (జూన్ 1) క్వాలిఫయర్2 ఆడనుంది.
102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, సాల్ట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ 3 ఓవర్లలోనే 30 పరుగులు జోడించారు. 12 పరుగులు చేసిన కోహ్లీని జెమీసన్ ఒక చక్కటి బంతితో కోహ్లీని ఔట్ చేశాడు. కోహ్లీ ఔట్ ప్రభావం జట్టుపై పడలేదు. సాల్ట్ బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ఆరో ఓవర్లో 21 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు మళ్లింది. సాల్ట్(27 బంతుల్లో 56:6 ఫోర్లు, 3 సిక్సర్లు), మయాంక్ రెండో వికెట్ కు 54 పరుగులు జోడించి మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చారు. ఈ క్రమంలో సాల్ట్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
19 పరుగులు చేసి మయాంక్ ఔటైనా.. కెప్టెన్ రజత్ పటిదార్ (7) తో కలిసి సాల్ట్ మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. పంజాబ్ బౌలర్లలో జెమీసన్ ముషీర్ ఖాన్ తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ దారుణమైన బ్యాటింగ్తో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. సయూశ్ శర్మ, హేజల్ వుడ్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. యష్ దయాల్ రెండు, భువనేశ్వర్, షెఫర్డ్ చెరో వికెట్ తీశారు. 26 పరుగులు చేసిన స్టోయినిస్ పంజాబ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు.
RCB crush PBKS and book their spot in the IPL final!#PBKSvRCB scorecard 👉 https://t.co/iLLczL9hQF pic.twitter.com/0369al2QIF
— ESPNcricinfo (@ESPNcricinfo) May 29, 2025