రెబల్ ఎమ్మెల్యేలకు జులై 11 వరకు పని లేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. వారంత గౌహతిలోనే రెస్ట్ తీసుకోవచ్చన్నారు. రెబల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేస్తూ డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నోటీసులపై జులై 12 వరకు స్టే విధించింది. దీనిపై సంజయ్ రౌత్ స్పందించారు. రెబల్ ఎమ్మెల్యేలకు ఇప్పట్లో పని లేదన్నారు. వచ్చేనెల 11 వరకు విశ్రాంతి తీసుకోవచ్చని కామెంట్ చేశారు సంజయ్ రౌత్.
It's an order for them to rest there (in Guwahati) till July 11. There is no work for them in Maharashtra: Shiv Sena MP Sanjay Raut on SC order of allowing Eknath Shinde & other rebel MLAs to file a reply to the disqualification notice issued to them by Dy Speaker by July 11 pic.twitter.com/GIKPVSuGIV
— ANI (@ANI) June 28, 2022