24 గంటల్లో మూడున్నర లక్షల కరోనా కేసులు

24 గంటల్లో మూడున్నర లక్షల కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 3,46,786 పాజిటివ్  కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,66,10,481గా నమోదైంది. అదేవిధంగా 24 గంటల్లో కరోనాతో 2,624 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు దేశం మొత్తం మీద కరోనా మరణాల సంఖ్య 1,89,544కు చేరింది. ఒక పక్కా కేసులు పెరుగుతున్నా.. డిశ్చార్జ్‌ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. నిన్న 2,19,838 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో మొత్తం రికవరీల సంఖ్య 1,38,67,997కు చేరింది. ప్రస్తుతం దేశంలో 25,52,940 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.