వరంగల్ ఎంజీఎం నుంచి రిమాండ్ ఖైదీ పరార్

వరంగల్ ఎంజీఎం నుంచి రిమాండ్ ఖైదీ పరార్

వరంగల్ అర్బన్: ఎంజీఎం నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. పరారైన రిమాండ్ ఖైదీ హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ ‌గా గుర్తించారు. కరోనా అనుమానిత లక్షణాలతో జైలు అధికారులు అతడిని ట్రీట్ మెంట్ కోసం ఎంజీఎం తీసుకొచ్చారు. 14 చోరీలు చేసి గత నెలలోనే పట్టుబడ్డ ఖైసర్… దొంగతనం కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎంజీఎం నుంచి ఖైసర్ పరారవడంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్తల కోసం..