కరోనా వైరస్ సోకిందని రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

కరోనా వైరస్ సోకిందని రిటైర్డ్‌ జడ్జి ఆత్మహత్య

కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఓ రిటైర్డ్ జడ్జి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ మియాపూర్ లోని న్యూ సైబర్ హిల్స్ లో ఉన్న ఆయన… తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాశారు. తన కారణంగా కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ లో తెలిపారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.