- హామీల అమలుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నరు
హైదరాబాద్, వెలుగు : రేవంత్పాలన బాగుందని, నెల రోజుల పాలన చూస్తే ఆనం దంగా ఉందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానా రెడ్డి అన్నారు. ప్రజా పాలన కాన్సెప్ట్తో ప్రజల మధ్యకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చిందన్న భావన కలుగు తున్నదని పేర్కొన్నారు. శుక్రవారం సీఎల్పీలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రేవంత్ రాత్రింబవళ్లూ పనిచేస్తున్నారన్నారు. ప్రజాపాలనలో తన వంతు పాత్ర పోషి స్తానని చెప్పారు. గతంలో పార్టీకి నాయక త్వం వహించానని, ఇప్పుడు కార్యకర్తగా పనిచేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులు, హామీలు, పథకాలు, విద్యుత్ కొనుగోళ్లు భవిష్యత్కు ప్రమాదమని తాను ఆనాడే చెప్పానని, తాను చెప్పిందే నిజమైందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.