దిశ అత్యాచార ఘటనలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించిన వర్మ

దిశ అత్యాచార ఘటనలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించిన వర్మ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న “దిశ” సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్న వర్మ ఇప్పటికే స్టోరీ ఎలా ఉంటుందో చెప్పాడు. ‘దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా చేయబోతున్నాను. ‘నిర్భయ’ అత్యాచారం తర్వాత అంతకంటే దారుణంగా ఓ ఆడపిల్లలను రేప్ చేసి సజీవదహనం చేశారు. దిశ ఘటన తర్వాత రేపిస్టులు ఏం నేర్చుకోలేదు, వారి ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. ఆలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో ఈ సినిమాలో చూపిస్తా, ప్రతీ విషయం క్షుణ్ణంగా చెబుతా”అని గతంలో చెప్పారు.

తాజాగా శనివారం రాత్రి  రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద వద్ద ప్రారంభించారు. వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అత్యాచార ఘటనలోని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.

దిశపై తొండుపల్లి టోల్ గేట్ వద్ద  అత్యాచారం చేసిన తర్వాత మృతదేహాన్ని చటాన్‌పల్లి శివారులో దహనం చేసేందుకు లారీలో తీసుకొచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మృతదేహాన్ని కాల్చడం, స్కూటీ, లారీతో సన్నివేశాన్నితీశారు