- కేరళలోని కాసరగోడ్లో విషాదం
కాసరగోడ్: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాసరగోడ్ జిల్లాలో సోమవారం సాయంత్రం స్కూల్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. అందులో నలుగురు మహిళలు ఉన్నారు. మహిళలంతా అక్కడికక్కడే మరణించగా.. ఆటో డ్రైవర్ -ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
చనిపోయిన నలుగురు మహిళలు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ సమయంలో స్కూలు బస్సులో పిల్లలు లేరు. పిల్లలను దించి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్జరిగిందని పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సు వేగంగా, రాంగ్రూట్లో రావడంవల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.