కేరళలో ఘోర ప్రమాదం ..ఆటోను ఢీకొట్టిన స్కూల్ ​బస్సు ఐదుగురు మృతి

కేరళలో ఘోర ప్రమాదం ..ఆటోను ఢీకొట్టిన స్కూల్ ​బస్సు ఐదుగురు మృతి
  • కేరళలోని కాసరగోడ్​లో విషాదం 

కాసరగోడ్: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాసరగోడ్ జిల్లాలో సోమవారం సాయంత్రం స్కూల్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. అందులో నలుగురు మహిళలు ఉన్నారు. మహిళలంతా అక్కడికక్కడే మరణించగా.. ఆటో డ్రైవర్ -ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. 

చనిపోయిన నలుగురు మహిళలు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఆ సమయంలో స్కూలు బస్సులో పిల్లలు లేరు. పిల్లలను దించి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్​జరిగిందని పోలీసులు తెలిపారు. స్కూల్ బస్సు వేగంగా, రాంగ్​రూట్​లో రావడంవల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.