సైబరాబాద్ పరిధిలో రూ.2.21 కోట్లు సీజ్

సైబరాబాద్ పరిధిలో రూ.2.21 కోట్లు సీజ్

గచ్చిబౌలి, వెలుగు: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  సైబరాబాద్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో ఎనిమిది చోట్ల రూ. 1,96, 70, 324 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బ్యాంకులకు నగదు తరలించే 7 వాహనాల్లో  సరైన క్యూఆర్ కోడ్ లు, ఎన్నికల సంఘం రూల్స్ పాటించకుండా తరలిస్తున్న రూ. 1,81,70,324 కోట్ల నగదు సీజ్ చేశారు. 

బ్రింక్స్ క్యాష్ లాజిస్టిక్స్ వెహికల్ ( టీఎస్ 10 యూడీ 1868 ) లో రూ.74,07,791,  - సీఎంఎస్ వెహికల్ (టీఎస్ 10 యూడీ6979) రూ. 34,00,000, రైటర్ సేఫ్ గార్డ్ వెహికల్ (టీఎస్ 09 యూడీ 4042 ) లో రూ. 21,74,520 , మరో రైటర్ సేఫ్ గార్డ్ వెహికల్ టీఎస్ 09 యూడీ 4033) లో రూ.19,26,405, ఇంకో రైటర్ సేఫ్ గార్డ్ వెహికల్ ( ఎంపీ 09 జీహెచ్ 6293) లో రూ. 15,49,848,  రైటర్ వెహికల్  (టీఎస్ 09 యూడీ 3718)లో రూ. 11,63,560, రేడియంట్ వెహికల్  (టీఎస్ 11 యూడీ 2560) లో  రూ. 5,48,200, ప్రైవేట్ వ్యక్తి  తన (టీఎస్ 07 ఈఎక్స్ 9200) రూ. 15,00,000 చొప్పున తరలిస్తుండగా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.