జనవరి 18 నుంచి ఉప్పల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ టికెట్ల అమ్మకం

జనవరి 18 నుంచి ఉప్పల్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ టికెట్ల అమ్మకం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ మధ్య ఈ నెల 25 నుంచి ఉప్పల్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరిగే తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన టికెట్లను 18 (గురువారం) నుంచి విక్రయించనున్నారు. పేటీఎం ఇన్‌‌‌‌‌‌‌‌సైడర్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. మిగిలిన టికెట్లను ఈ నెల 22 నుంచి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌తో పాటు జింఖానాలోని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ స్టేడియంలో ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో కూడా అమ్మనున్నారు.

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బుక్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న వారు 22వ తేదీ నుంచి గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు కార్డు చూపించి టికెట్లను తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణలో పని చేస్తున్న ఇండియన్‌‌‌‌‌‌‌‌ ఆర్మీ సిబ్బంది ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌కు రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌ డే రోజున మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. ఆసక్తి గల వారు తమ హెచ్‌‌‌‌‌‌‌‌వోడీలతో సంతకం పెట్టిన కాపీలను ఈ నెల 18 లోపు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏకు మెయిల్‌‌‌‌‌‌‌‌ చేయాలి. స్కూల్‌‌‌‌‌‌‌‌ విద్యార్థుల కోసం రోజుకు 5 వేల చొప్పున 25 వేల కాంప్లిమెంటరీ పాస్‌‌‌‌‌‌‌‌లను కేటాయించారు.