ముంబై: కేజీఎఫ్ మూవీ సాధించిన విజయం గురించి తెలిసిందే. ఐదు భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్గా వచ్చిన ఈ సినిమా అన్ని లాంగ్వేజ్ల్లోనూ బంపర్ హిట్ కొట్టింది. దీంతో కేజీఎఫ్ చాప్టర్-2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే రీసెంట్గా రిలీజైన చాప్టర్-2 టీజర్ యూట్యూబ్లో సంచనం రేపుతోంది. విడుదలైన రెండ్రోజులకే 92 మిలియన్లకు పైగా వ్యూస్, 5 మిలియన్ల లైక్స్తో దూసుకుపోతోంది. ఈ ఫిల్మ్లో బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్ విలన్ అధీరా పాత్రలో నటించాడు. టీజర్లో ఆయన లుక్స్ ఆకట్టుకున్నాయి.
Brutality of ??????? Will Continue @duttsanjay
.
.@TheNameIsYash @prashanth_neel @VKiragandur @SrinidhiShetty7 @bhuvangowda84 @Karthik1423 @hombalefilms @KRG_Studios
.#KGF #KGF2#KGFchapter2 #Adheera #Yash #SanjayDutt #KRGconnects #HouseToHousefull pic.twitter.com/AbdFvtKFHp— KRG Connects (@KRG_Connects) October 15, 2020
ఈ నేపథ్యంలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలసి పని చేయడంపై సంజూ బాబా తన అనుభవాలు పంచుకున్నాడు. నీల్తో పని చేయడం చాలా కంఫర్టబుల్గా అనిపించిందని, ఆయన డైరెక్షనల్ స్కిల్స్ అద్భుతమని కొనియాడాడు. ‘ప్రశాంత్ చాలా వినయం కలిగిన వ్యక్తి. ఆయనతో పని చేయడం మంచి అనుభూతి. నీల్తో కలసి పని చేయడం ఇదే మొదటిసారే అయినా చాలా కంఫర్టబుల్గా అనిపించింది. మేమిద్దరం చాలా విషయాలు మాట్లాడుకునే వాళ్లం. ఆయన వర్కింగ్ స్టయిల్ పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. ప్రశాంత్ దర్శకత్వంలో పని చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నా. కేజీఎఫ్ ప్రపంచంలో నేనెప్పుడూ భాగంగానే ఉన్నా’ అని సంజయ్ దత పేర్కొన్నారు.