సంక్రాంతి పండుగ: ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

సంక్రాంతి పండుగ: ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

సంక్రాంతి పండుగకు సొంతూళ్ల బాట పట్టారు ప్రజలు.  హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్న జనంతో నగరంలోని  బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కిటకిటలాడుతున్నాయి. భారీగా వస్తున్న ప్రయాణికులతో సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల తో పాటు బస్టాండ్లన్నీ సందడిగా మారాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కరోనా నిబంధనలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థలు కూడా అదనపు సర్వీసులు నడుపుతున్నాయి.