మాజీ ISIS చీఫ్ సక్విబ్ నాచన్ మృతి

మాజీ ISIS చీఫ్ సక్విబ్ నాచన్ మృతి

న్యూఢిల్లీ:నిషేదిత ఉగ్రవాద గ్రూప్​ ISIS మాజీ చీఫ్, స్టూడెంట్స్​ ఇస్లామిక్​ మూవ్​ మెంట్​ఆఫ్​ ఇండియా(SIMI) సక్విబ్​ నాచన్​శనివారం (జూన్​ 28) ఢిలలీలోని సప్దర్​జంగ్​ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం మెదడులో రక్తస్రావంతో నాచన్​ ఢిల్లీలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ చనిపోయారు. 

మహారాష్ట్రలోని థానే జిల్లా పడ్ఘా నివాసి అయిన నాచన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 24 న ఆయనను తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నాచన్​ శనివారం మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో అతను మృతిచెందాడు. 

2023 ఐసిస్ తో సంబంధాలున్నయని నాచన్‌ను NIA అరెస్టు చేసింది.నాచన్​ ముంబై పేలుళ్లు ,ఉగ్రవాద కేసుల్లో కీలక నిందితుడు.