
న్యూఢిల్లీ:నిషేదిత ఉగ్రవాద గ్రూప్ ISIS మాజీ చీఫ్, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ఆఫ్ ఇండియా(SIMI) సక్విబ్ నాచన్శనివారం (జూన్ 28) ఢిలలీలోని సప్దర్జంగ్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం మెదడులో రక్తస్రావంతో నాచన్ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ చనిపోయారు.
మహారాష్ట్రలోని థానే జిల్లా పడ్ఘా నివాసి అయిన నాచన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో జూన్ 24 న ఆయనను తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నాచన్ శనివారం మధ్యాహ్నం 12:10 గంటల ప్రాంతంలో అతను మృతిచెందాడు.
2023 ఐసిస్ తో సంబంధాలున్నయని నాచన్ను NIA అరెస్టు చేసింది.నాచన్ ముంబై పేలుళ్లు ,ఉగ్రవాద కేసుల్లో కీలక నిందితుడు.