
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్న క్రమంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా తొలివిడత 110 మంది భారతీయ భారతీయ విద్యార్థులు ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ( జూన్ 19 ) తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీలో ల్యాండ్ అయిన ఈ విమానంలో విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఇరాన్ లో తమ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆకాశంలో మిస్సైళ్ళను చూశామని.. పరిసర ప్రాంతాల్లో బాంబుల శబ్దం విని వణికిపోయామని అన్నారు. చావు ఖాయమని అనుకున్నామని.. ఆ విధ్వంసాన్ని తలచుకుంటే ఇప్పటికీ భయంతో వణుకుపుడుతోందని అన్నారు స్టూడెంట్స్.
క్షిపణులను కళ్లారా చూశామని.. బాంబు శబ్దాలు విని వణికిపోయామని అన్నారు. దాడుల సమయంలో తాము ఉన్న బిల్డింగులు కూడా కదిలాయని అన్నారు స్టూడెంట్స్. ఈ పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదని అన్నారు. ఇండియాకు తిరిగి వస్తామో లేదోనని బయపడ్డామని అన్నారు. ఇరాన్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. తమను త్వరగా ఇండియాకు తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి, ఇండియన్ ఎంబసీకి రుణపడి ఉంటామని అన్నారు స్టూడెంట్స్.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
— ANI (@ANI) June 18, 2025
A student evacuated from Iran, says, "The situation over there is worsening day by day... The situation is particularly very bad in Tehran. Indian students are all being evacuated from there. We… pic.twitter.com/JxARgyDQPt
ఇదిలా ఉండగా.. ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మొండిపట్టుదల వీడి సరెండర్ కావాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనిని హెచ్చరించారు. బేషరతుగా లొంగిపోయి అణ్వాయుధాలు తయారుచేయబోమని ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు.
Also Read : కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ డ్యామేజ్
ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలంటే అణ్వాయుధాల గురించి మర్చిపోవాల్సిందేనన్నారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని, ఆయనను వెతికి మరీ చంపగలమని ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు. ఖమేనీ మొండి వైఖరికి ఇరాన్ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని చెప్పారు. టెహ్రాన్ లో మరింత తీవ్ర దాడులు జరుగుతాయని, ఆ ప్రాంతాన్ని వదిలి దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచించారు.