కాసేపట్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కీలకఘట్టం

కాసేపట్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కీలకఘట్టం

సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాల వేడుకల్లో భాగంగా సోమవారం (జులై 10న) రంగం కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి స్వర్ణలత అమ్మవారు చెప్పనున్నారు.

ఇప్పటికే రంగం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండో రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రంగం కార్యక్రమం కోసం ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయానికి చేరుకున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై అమ్మవారు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. తన నిధులను కాజేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ ఏడు అమ్మ నోట ఏం పలకబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.