ట్రయల్ కు వ్యతిరేకంగా రిపబ్లికన్ల తీర్మానం ఫెయిల్
ట్రంప్కు యాంటీగా ఓటేసిన ఆరుగురు రిపబ్లికన్లు
వాషింగ్టన్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై సెనేట్లో బుధవారం మధ్యాహ్నం (లోకల్ టైం ప్రకారం) ఇంపీచ్మెంట్ ట్రయల్ షురూ కానుంది. పదవి నుంచి దిగిపోయిన ప్రెసిడెంట్ను మళ్లీ తొలగించడం ఏమిటని, దాన్ని అడ్డుకోవాలని రిపబ్లికన్లు సెనేట్లో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. వంద మంది సభ్యులున్న సెనేట్లో తీర్మానానికి వ్యతిరేకంగా 56 ఓట్లు, అనుకూలంగా 44 ఓట్లు వచ్చాయి. సెనేట్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు చెరో 50 సీట్లు ఉన్నాయి. అయితే ట్రంప్ సొంత పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశా రు. దీంతో ట్రంప్ పై ట్రయల్కు అడ్డంకి తొలగిపోయింది. ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ నిరాకరించారు.
ట్రంప్ గట్టెక్కే చాన్సే ఎక్కువ
హౌజ్ ఆఫ్రిప్రజెంటేటివ్స్ నియమించిన ఇంపీచ్ మెంట్ మేనేజర్లు, ట్రంప్ లాయర్లు బుధవారం (అమెరికా టైమ్)సెనేట్లో వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఇంపీచ్ మెంట్ పాస్ కావాలంటే సభలో మూడొంతుల సభ్యుల (67) ఓట్లు అవసరం. కానీ ట్రంప్పై అభిశంసన తీర్మానం వీగిపోయే చాన్సే ఎక్కువగా ఉందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికా హిస్టరీలోనే రెండు సార్లు ఇంపీచ్ మెంట్ను ఎదుర్కొన్న ఒకే ఒక్క ప్రెసిడెంట్గా, పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఇంపీచ్ మెంట్కు గురైన ఏకైక ప్రెసిడెంట్గా ట్రంప్ ఇప్పటికే చెడ్డపేరు
మూటగట్టుకున్నారు.
లీడింగ్ గ్లోబల్ పవర్ గా ఇండియా: బైడెన్
ఇండియా లీడింగ్ గ్లోబల్ పవర్ గా ఎదగడాన్ని స్వాగతిస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అన్నారు. ఇండో- పసిఫిక్ రీజియన్ లో భద్రతపై కీలక పాత్ర పోషిస్తున్న ఇండియా తమకు అతి ముఖ్యమైన పార్ట్ నర్ అని చెప్పారు. యూఎస్ – ఇండియా పార్ట్నర్షిప్పై తమ విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, ఇండియన్ మినిస్టర్ జైశంకర్ ఫోన్లోమాట్లాడారని, డిఫెన్స్, కౌంటర్ టెర్రరిజం, పర్యావరణం, హెల్త్, ఎడ్యుకేషన్ సహా పలు అంశాలపై చర్చించారని బైడెన్ చెప్పారు.