నేటితో ముగియనున్న శ్రీనివాస్‌రెడ్డి పోలీస్ కస్టడీ

నేటితో ముగియనున్న శ్రీనివాస్‌రెడ్డి పోలీస్ కస్టడీ

యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్‌లో విద్యార్థినుల హత్య కేసు నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. దీంతో అతన్ని భువనగిరి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని వరంగల్ జైలుకి తరలించనున్నారు. ఐతే కేసులో మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు శ్రీనివాస్ రెడ్డిని మరో వారం రోజులు కస్టడీ కోరనున్నారు పోలీసులు. 6 రోజుల కస్టడీలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తుంది. మూడు హత్యలు ఎలా చేశాడు…? దీనికి ఎవరైనా సహకరించారా..? అనే అంశాలపై ఆరా తీసినట్టు సమాచారం.