అడవి శేష్ X శృతి హాసన్.. ఈసారి సరికొత్తగా థ్రిల్ చేస్తారట!

అడవి శేష్ X శృతి హాసన్.. ఈసారి సరికొత్తగా థ్రిల్ చేస్తారట!

అడివి శేష్(Adivi Sesh).. టాలీవుడ్ లో థ్రిల్లర్ చిత్రాలకు కేరాఫ్ గా మారిపోయాడు. ఆయన నుండి వచ్చిన దాదాపు అన్ని సినిమాలు థ్రిల్లర్ జానర్ లో వచ్చినవే. క్షణం, ఎవరు, గూఢచారి ఇలా దాదాపు అన్ని సూపర్ హిట్ గా నిలిచినవే. ఇక ఇప్పుడు మరోసారి తన సేఫ్ జానర్ లో మరోసారి ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి వస్తున్నారు శేష్. అది కూడా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో కలిసి. 

ఈ కాంబోలో ఒక సినిమా రానుంది. ఇదే విషయాన్ని శృతి హాసన్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించారు. #SeshEXShruti అనే హ్యాష్ టాగ్ తో అనౌన్సమెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. అందులో అడివి శేష్ లుక్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉండటంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక అన్నపూర్ణ ప్రొడక్షన్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాను సానియేల్ డియో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ ను డిసెంబర్ 18న రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. మరి మరోసారి తన ఫెవరేట్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అడివి శేష్ ఈసారి ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాడో చూడాలి.