
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో దూకుడుగా ఆడుతున్న భారత బ్యాట్స్ ఉమెన్ షెఫాలీ వర్మ ఐసీసీ ఉమెన్స్ టీ20ఐ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. ఈ ర్యాంకును కూడా కేవలం 18 మ్యాచులు మాత్రమే ఆడి దక్కించుకోవడం విశేషం. ఈ 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం 19 స్థానాలను మెరుగుపరచుకొని నెంబర్ వన్ ర్యాంకును చేరుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో అద్భుతమైన బ్యాటింగ్ ఫర్ఫామెన్స్తో షెఫాలీ మొదటి ర్యాంకుకు చేరుకుంది.
షెఫాలీ టీ20 గేమ్లలో 146.96 స్ట్రైక్ రేట్తో 485 పరుగులు చేసింది. ప్రస్తుత వరల్డ్ కప్లో షెఫాలీ 161 పరుగులు చేసింది. అత్యధికంగా శ్రీలంకపై 47 పరుగులు చేసింది. భారత్కు చెందిన స్మృతి మంధనా రెండు స్థానాలు దిగజారి ఆరవ స్థానంలో ఉంది. మరో ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా రెండు స్థానాలు దిగజారి తొమ్మిదవ స్థానంలో ఉంది.
బౌలింగ్ విషయానికొస్తే.. భారత్కు చెందిన పూనం యాదవ్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టిన నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. దీప్తి శర్మ, రాధ యాదవ్ వరుసగా ఐదు, ఏడవ స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
For More News..