
పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. సోమవారం (మే 26) ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన తర్వాత 19 క్వాలిఫయర్ 1లో చోటు సంపాదించింది. ఈ మ్యాచ్ లో విజయంలో శశాంక్ పాత్ర లేకపోయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఈ సీజన్ కు ముందు పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ శశాంక్ మాత్రం తన జట్టును నమ్మాడు. ప్లే ఆఫ్స్ కాదు ఏకంగా టాప్- 2 లో ఉంటుందని అంచనా వేశాడు.
ఈ సీజన్ కు ముందు ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన శశాంక్ తమ జట్టు ఎలా ఉండబోతుందో చెప్పుకొచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్లో శుభంకర్ మిశ్రాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో శశాంక్ ప్లే ఆఫ్స్ వెళ్లే జట్ల గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని.. అంతేకాదు ఐపీఎల్ 2025లో టాప్-2 లో నిలుస్తుందని అంచనా వేశాడు. ఈ పంజాబ్ బ్యాటర్ వేసిన అంచనా నిజమైంది. అప్పుడు అందరూ శశాంక్ తమ జట్టుపై ఓవర్ కాన్ఫిడెంట్ తో ఇలా చెప్పాడని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అదే నిజం అయ్యేసరికీ శశాంక్ పాత వీడియో నేటిన్ట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ సీజన్ లో శశాంక్ అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ లో పంజాబ్ కు కీలక పరుగులు చేస్తూ తన ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున సహచర క్రికెటర్లు విఫలమవుతున్నప్పటికీ ఒక్కడే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్ని మ్యాచ్ లు ఓడిపోయినా మరికొన్ని మ్యాచ్ ల్లో పంజాబ్ కు సంచలన విజయాలను అందించాడు. ఏ మాత్రం అంచనాలు లేని శశాంక్ అద్భుతంగా రాణించడంతో అతన్ని 2025 ఐపీఎల్ కోసం రూ. 5.5 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.
►ALSO READ | LSG vs RCB: హమ్మయ్య బిగ్ రిలీఫ్ ఇచ్చావు: ప్లే ఆఫ్స్కు ఆ ఇద్దరు స్టార్స్ వస్తారని చెప్పిన RCB కెప్టెన్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ పటిష్టమైన ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది. జైపూర్ వేదికగా సోమవారం (మే 26) ముగిసిన మ్యాచ్ లో ముంబైపై 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా ప్లేయర్ జోస్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73:9 ఫోర్లు, 3 సిక్సర్లు), టీమిండియా యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (35 బంతుల్లో 62:9 ఫోర్లు, 2 సిక్సర్లు) పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది.
A COLD STATEMENT BY SHASHANK SINGH 🔥
— Pankaj Sharma (@PaSh18167547) May 26, 2025
- Punjab Kings did what Shashank Singh said in @shubhankrmishra Podcast.#PBKSvsMI pic.twitter.com/7qNpb3EtTW