ఈ ఎంపీ కారు డ్రైవర్ పేరు మీద 150 కోట్ల రూపాయల ల్యాండ్.. అది కూడా గిఫ్ట్గా..!

ఈ ఎంపీ కారు డ్రైవర్ పేరు మీద 150 కోట్ల రూపాయల ల్యాండ్.. అది కూడా గిఫ్ట్గా..!

ముంబై: మహారాష్ట్రలో ఒక ఎంపీ డ్రైవర్ 150 కోట్ల రూపాయల విలువైన 3 ఎకరాల ల్యాండ్ గిఫ్ట్గా పొందిన ఘటన విస్మయానికి గురిచేసింది. మహారాష్ట్ర ఆర్థిక నేర విభాగం అధికారులు ఈ ఎంపీ డ్రైవర్ ‘గిఫ్ట్ డీడ్’ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. దీంతో.. ఈ విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్రపతి శంభాజీనగర్ శివసేన ఎంపీ సందీపన్ రావ్ ఆశారాం భూమ్రే కారు డ్రైవర్ వార్తల్లో నిలిచాడు. ఎంపీ కారు డ్రైవర్కు ‘డొనేషన్ డీడ్’ కింద 150 కోట్ల ల్యాండ్ దక్కడమే ఇందుకు కారణం. ఎంపీ డ్రైవర్ పేరు మీద ఇన్ని కోట్ల విలువైన ల్యాండ్ ఎందుకు ఉంది..? బినామీ ఆస్తిని డ్రైవర్ పేరు మీద రాయించారా..? ఈ కోణంలోనే ఛత్రపతి శంభాజీనగర్ ఆర్థిక నేర విభాగం అధికారులు విచారిస్తున్నారు.

పైగా.. ఈ ల్యాండ్ ఆషామాషీ వ్యక్తుల పేరు మీద  లేదు. హైదరాబాద్లో నిజాంల పాలనలో దివాన్లుగా ఓ వెలుగు వెలిగిన సాలార్ జంగ్ కుటుంబం పేరు మీద ఈ మూడు ఎకరాలు ఉంది. దీంతో.. సాలార్ జంగ్ కుటుంబానికి, ఈ ఎంపీ కారు డ్రైవర్కు ఉన్న సంబంధం ఏంటని ఆర్థిక నేర విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ జావెద్ రసూల్ షేక్ ఎంపీ దగ్గర, ఎంపీ కొడుకు దగ్గర పదమూడేళ్లుగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ 150 కోట్ల ల్యాండ్ ‘గిఫ్ట్ డీడ్’గా ఇచ్చిన వ్యవహారంపై డ్రైవర్ జావెద్ స్పందించాడు.

పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని.. సాలార్ జంగ్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జల్నా రోడ్లోని దావూద్పుర ప్రాంతం మాములు ఏరియాలో కాదు. నగరంలోనే రిచెస్ట్ ఏరియా. అలాంటి ప్రాంతంలో మూడు ఎకరాల ల్యాండ్ ఒక కారు డ్రైవర్కు బహుమతిగా దక్కడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో డ్రైవర్ జావెద్కు నోటీసులు పంపినట్లు సిటీ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ పవార్ తెలిపారు. తనకు సాలార్ జంగ్ కుటుంబంతో ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయని, అందుకే ఈ ల్యాండ్ తనకు బహుమతిగా రాసిచ్చారని సదరు డ్రైవర్ చెప్పుకురావడం గమనార్హం.