నిత్యావసరాల కొరత రానీయొద్దు: సీఎం కేసీఆర్

నిత్యావసరాల కొరత రానీయొద్దు: సీఎం కేసీఆర్
  • అదే స్ఫూర్తితో లాక్ డౌన్ కొనసాగించాలి
  • ధాన్యం కొనుగోళ్లు యథావిధిగా జరగాలి
  •  ఆఫీసర్లతో సమీక్షలో సీఎం కేసీఆర్

లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని, వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని అధికారయంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా వ్యాప్తి ని నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని రాష్ట్ర ప్రజలను సీఎం కోరారు. కరోనా వైరస్ సోకినవారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసినవారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టా రు. కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్సఅం దిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. వారి కుటుంబసభ్యులు, వారు కలిసినవారిని కూడా గుర్తించి క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువయినప్పటికీ అందరికీ చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసి నట్లుఅధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఖాతాలోరూ. 1500 వేస్తున్నం

దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కావడం వల్ల నే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించి సహకరించాలని సీఎం సూచించారు. రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలని తెలిపారు. రేషన్కార్డున్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొ ప్పున బ్యాంకు అకౌంటులో వేసే కార్యక్ర మం శుక్రవారం ప్రారంభించామని, అందరికీ డబ్బులు అందుతాయని అన్నారు. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కేంద్రాలను సరిగ్గానిర్వహించాలని, రైతులు చెప్పిన సమయానికి వెళ్లిధాన్యం అమ్ముకుని పోవాలన్నారు. ఇవాళ(శనివారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జరిగే వీడియో కాన్ఫరెన్సులో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం జరిగే మంత్రివర్గసమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. సమీక్షలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.