అయోధ్య శ్రీరాముడి దర్శనానికి ప్రత్యేక రైళ్లు : శ్యాంసుందర్ గౌడ్

అయోధ్య శ్రీరాముడి దర్శనానికి ప్రత్యేక రైళ్లు : శ్యాంసుందర్ గౌడ్

ముషీరాబాద్,వెలుగు: అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి  రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి ప్రతి రోజు ప్రత్యేక రైళ్లను బీజేపీ అధిష్టానం, రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో1,344 మంది శ్రీరామ భక్తులు ప్రత్యేక ట్రైన్ లో సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్తారని బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ తెలిపారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో  ట్రైన్ భోగీల ఇన్ చార్జ్ లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.  ట్రైన్ లో రామ భజన చేస్తూ భక్తులు అయోధ్యకు  ప్రయాణిస్తారని చెప్పారు. భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, ట్రైన్ ఇన్ చార్జ్ రమేష్ రామ్, పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ చార్జ్ రాజశేఖర్ రెడ్డి, నేతలు సీకే శంకర్, సలాద్రి శ్రీనివాస్ యాదవ్, జమాల్పూర్ నందు, రాజేశ్వరరావు, వినయ్ గుప్త పాల్గొన్నారు.