- పీర్జాదిగూడలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం
మేడిపల్లి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మల్కాజిగిరి కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని పీర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఎంపీ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. సునీతామహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.