అనంత్ నాగ్ ఎన్ కౌంటర్.. టెర్రరిస్టులు హతం

అనంత్ నాగ్ ఎన్ కౌంటర్.. టెర్రరిస్టులు హతం

భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు మరోసారి ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు మిలిటెంట్లు,నలుగురు లోకల్ టెర్రరిస్టులు ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో  ఒక పోలీసు గాయపడ్డారని జమ్మూకశ్మీర్ భద్రతా అధికారులు తెలిపారు. కుల్గాం జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ప్రాంతంలో బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా, దాక్కున్న ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరపడంతో బలగాలు ఉగ్రవాదులపై కాల్పులు చేశాయని జమ్మూకశ్మీర్ ఐజీపీ తెలిపారు.