సత్తా చాటిన రైతుకూలీ కొడుకు

సత్తా చాటిన రైతుకూలీ కొడుకు

 వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామానికి చెందిన దయ్యాల తరుణ్ కుమార్ సివిల్స్ లో 231వ ర్యాంకు సాధించాడు. తరుణ్ తల్లిదండ్రులు శశికళ, బాబయ్య తమకున్న భూమిలో వ్యవసాయం చేస్తూ, కూలీ పనులు చేస్తూ కొడుకును చదివించారు. బాబయ్య సోదరుడు కృష్ణ రైల్వేలో ఉద్యోగం చేస్తూ తరుణ్ కి గైడెన్స్ ఇస్తూ ఉన్నత చదువులకు సహకారం అందించారు. తరుణ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్​లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. సిటీలోనే ఉన్నత విద్య కూడా పూర్తి చేశారు.