నిన్న అన్నపై దాడి.. నేడు తండ్రిని హతమార్చిన మానవ మృగం

నిన్న అన్నపై దాడి.. నేడు తండ్రిని హతమార్చిన మానవ మృగం

నిర్మల్ జిల్లా : తోడ బుట్టిన అన్నయ్య, కన్నతండ్రి అనే తేడా లేకుండా దారుణంగా దాడి చేశాడో దుర్మార్గుడు. ఈ దాడిలో తండ్రి చనిపోగా.. అన్న తీవ్రగాయాలతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. కుటుంబ కలహాలతో గురువారం అన్నతో గొడవపడ్డాడు. దీంతో మాటా మాటా పెరగడంతో అన్నపై కొడవలితో దాడి చేశాడు. గాయాలైన అతడిని హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు మందలించి వదిలేశారు. ఇదే విషయంపై తండ్రి మందలీయడంతో శుక్రవారం తండ్రిని బండరాయితో కొట్టి హత్య చేశాడు.

ఈ దారుణ సంఘటన నిర్మల్ జిల్లాలో జరుగగా స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని కూచనపల్లి  గ్రామానికి చెందిన సంగటి రవి(25).. శుక్రవారం నడిరోడ్డుపై సంగటి పెద్ద రాజన్న (58) పై బండరాయితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకుని రవిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం  అన్నపై దాడి చేసిన రవి..స్టేషన్ నుండి విడుదల కాగానే శుక్రవారం తండ్రిని హతమార్చాడని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేశామని ప్రస్తుతం హంతకుడు రవి పోలీసుల అదుపులోనే ఉన్నాడన్నారు.