కేటీఆర్, కవితతో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి భేటీ !

కేటీఆర్, కవితతో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి భేటీ !

హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఈ ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఎంపీ అసదుద్దీన్ తో ఆయన ఇంట్లో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా పాల్గొన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. టీఆర్ఎస్ లో చేరికపై సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవి, చేవెళ్ల ఎంపీ టికెట్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.

కేటీఆర్ లతో చర్చించిన తర్వాత.. సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి నేరుగా హైదరాబాద్ లోని ఎంపీ కవిత ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ కవితతో సబిత, కార్తీక్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై డిస్కస్ చేసినట్టు సమాచారం. మరో మూడు, నాలుగు రోజుల్లో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.