హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన ప్రిసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ ఆజాద్ ఇంజనీరింగ్.. జపాన్కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్(ఎంహెచ్ఐ) కోసం ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తామని ప్రకటించింది. మేడ్చల్లోని తునికి బొల్లారంలో నిర్మించబోయే ఈ ఫెసిలిటీ కోసం 20 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తారు. ఇందుకోసం బుధవారం భూమిపూజ చేశారు. ఈ ఫ్యాక్టరీలో హైలీ క్రిటికల్, కాంప్లెక్స్పార్టులను తయారు చేస్తారు.
11,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ ప్లాంటు వల్ల 300 మందికి ఉద్యోగాలు వస్తాయి. భూమిపూజ కార్యక్రమంలో ఆజాద్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ రాకేష్ చోప్దార్, ఎంహెచ్ఐ ఛైర్మన్ టి. నాగయాసు, సంస్థ డిప్యూటీ సీఈఓ కె. తనక, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ , ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.