
గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. టెస్ట్ ముగియడానికి చివరి రోజు చివరి సెషన్ మాత్రమే మిగిలి ఉంది. రెండో ఇన్నింగ్స్ ను బంగ్లాదేశ్ డిక్లేర్ ఇవ్వడంతో శ్రీలంక ముందు 296 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 37 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కానుంది. దీంతో 10 వికెట్లు తీసి మ్యాచ్ గెలుద్దామని బంగ్లా.. మరోవైపు వేగంగా ఆడి సంచలన సృష్టించాలని లంక ఆరాటపడుతున్నాయి.
మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయంగా కనిపిస్తున్నా ఇరు జట్లు మాత్రమే ఫలితం కోసం ప్రయత్నిస్తున్నాయి. మరో మూడు గంటల్లో మ్యాచ్ ఫలితం రానుంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే శ్రీలంకతో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ శాంటో (148), ముష్ఫికర్ రహీమ్ (163) సెంచరీలకు తోడు లిటన్ దాస్ (90) రాణించడంతో.. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 495 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్ లో 485 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ALSO READ | IND vs ENG 2025: బ్లాక్ సాక్స్ ధరించిన గిల్.. వివాదంలో టీమిండియా కెప్టెన్
రెండో ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (125) రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ బాదడం విశేషం. ఓపెనర్ షాదమన్ ఇస్లాం (76), రహీం(49) కీలక ఇన్నింగ్స్ ఆడారు. 296 పరుగుల లక్ష్యంతో రెండో ఇనింగ్స్ ప్రారంభించిన శ్రీలంక ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 5 ఓవర్లలో 27 పరుగులు చేసింది.
Bangladesh declare in Galle, setting Sri Lanka a target of 296.
— ESPNcricinfo (@ESPNcricinfo) June 21, 2025
Will the hosts have a crack at it with a few hours left on day 5?https://t.co/3H5MpjdLAc #SLvBAN pic.twitter.com/FDiXTyziGy