
ఇంగ్లాండ్ పై లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ సెంచరీతో దుమ్ములేపాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఓవరాల్గా టెస్టుల్లో గిల్కు ఇది ఆరవ సెంచరీ. కెప్టెన్గా తీవ్ర ఒత్తిడిలో ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన గిల్.. ఆడిన తొలి మ్యాచులోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అందరి ప్రశంసలు అందుకుంటూ రెండో రోజు బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో గిల్ ఒక వివాదంలో ఇరుక్కున్నాడు. అయితే పెద్ద వివాదం కాకపోవడం ఊరటనిస్తోంది.
సాయి సుదర్శన్ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నల్ల సాక్స్ వేసుకున్నాడు. ఐసీసీ.. ప్లేయర్ దుస్తులు, పరికరాల నిబంధనల (క్లాజు 19.45) ప్రకారం, టెస్ట్ మ్యాచ్ల్లో ఆటగాడి సాక్స్ తెలుపు, క్రీమ్ లేదా లేత బూడిద రంగులో ఉండాలి. ఈ నియమం 2024 నుండి అమలులో ఉంది. గిల్ డ్రెస్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐసీసీ నుండి క్రమశిక్షణా చర్యను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే, నల్ల సాక్స్ ధరించినందుకు భారత కెప్టెన్కు జరిమానా విధించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్దే.
►ALSO READ | IND vs ENG 2025: కామెంట్రీ చేస్తూ కోహ్లీని అవమానించిన టీమిండియా మాజీ క్రికెటర్
ఉద్దేశపూర్వకంగా లెవల్ 1 నేరంగా గుర్తిస్తే, గిల్ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది. గిల్ అనుకోకుండా ఎంపిక చేసుకున్నాడని తేలితే, అతను పెనాల్టీని తప్పించుకోవచ్చు. ఈ మ్యాచ్ లో సెంచరీ బాదిన గిల్.. 175 బంతుల్లో 127 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించనున్నాడు. గిల్ ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ (175 బాల్స్లో 16 ఫోర్లు, 1 సిక్స్తో 127 బ్యాటింగ్) తో పాటు యశస్వి జైస్వాల్ (159 బాల్స్లో 16 ఫోర్లు, 1 సిక్స్తో 101) సెంచరీతో చెలరేగాడు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ (65) సెంచరీ చేయడంతో తొలి రోజు భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది.
🚨 Gill’s Black Socks Stir Controversy!
— SportsTiger (@The_SportsTiger) June 21, 2025
Shubman Gill could be in a spot of trouble for wearing black-coloured socks — a possible breach of ICC dress code regulations 👀🧦
Let’s see how this one unfolds!
📷: BCCI#Cricket #TeamIndia #ShubmanGill #INDvENG #ENGvIND pic.twitter.com/gxsmhNuF5Z