
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం (జూన్ 20) మొదటి రోజు ప్రారంభమైన ఆటలో ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని పరోక్షంగా అవమానించాడు. టెస్టుల్లో కోహ్లీ బలహీనతను బయట పెట్టాడు. కోహ్లీ ఆఫ్-స్టంప్ వెలుపల పడుతున్న బంతులను హిట్ చేయాలని చూస్తూ.. కీపర్ లేదా స్లిప్ క్యాచ్ ఔట్ అవ్వడం తరచూ చూస్తూనే ఉంటాం. ఎప్పటి నుంచో విరాట్ కు ఈ బలహీనత ఉంది.
తొలి రోజు తొలి సెషన్ లో భాగంగా టీమిండియా ఓపెనర్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. జాగ్రత్తగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంపు బంతులను ఆడకుండా వదిలేశాడు. ఈ సమయంలో కామెంట్రీ చేస్తున్న సంజయ్.. రాహుల్ బ్యాటింగ్ ను పొగుడుతూనే కోహ్లీపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. " ఈ బంతికి మాజీ బ్యాటర్ ఔటయ్యి ఉండేవాడు. అతనెవరో మనకందరికీ తెలుసు. కానీ జైశ్వాల్, రాహుల్ ఆ తప్పు చేయడం లేదు". అని సంజయ్ అన్నాడు. ప్రత్యేకంగా కోహ్లీ పేరు ప్రస్తావించకపోయినా.. సంజయ్ టార్గెట్ చేసింది మాత్రం కోహ్లీని అని స్పష్టంగా తెలుస్తుంది.
►ALSO READ | చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్లో తొలి ప్రయత్నంలోనే గోల్డ్ మెడల్
ఈ మ్యాచ్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్మన్ గిల్ (175 బాల్స్లో 16 ఫోర్లు, 1 సిక్స్తో 124 బ్యాటింగ్), యశస్వి జైస్వాల్ (159 బాల్స్లో 16 ఫోర్లు, 1 సిక్స్తో 101) ఇంగ్లండ్ గడ్డపై సెంచరీలతో దుమ్మురేపారు. ఈ ఇద్దరి ఖతర్నాక్ ఆటతో ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం మొదలైన తొలి టెస్టును ఇండియా అద్భుతంగా ఆరంభించింది. మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా85 ఓవర్లలో 359/3 చేసి భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ (42) ఆకట్టుకోగా.. గిల్కు తోడుగా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (102 బాల్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 బ్యాటింగ్) ఫిఫ్టీతో క్రీజులో ఉన్నాడు.