
భారత జావెలింగ్ త్రో సూపర్ స్టార్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. పారిస్ లో జరుగుతున్న డైమండ్ లీగ్ లో గోల్డ్ మెడల్ సాధించి ఔరా అనిపించాడు. శుక్రవారం (జూన్ 20) తన తొలి ప్రయత్నంలోనే బల్లాన్ని 88.16 మీటర్లు విసిరి జర్మన్ స్టార్ జూలియన్ వెబర్ ను ఓడించి విజేతగా నిలిచాడు.
మొదటి ప్రయత్నంలో 88.16 మీటర్లు విసిరిన నీరజ్.. ఆ తర్వాత ప్రయత్నాల్లో అంత దూరం విసరలేకపోయాడు. రెండో త్రో లో 85.10 మీటర్లు విసిరినా.. ఆ తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్ అయ్యాడు. ఆ తర్వాత 6వ త్రోలో అలాగే చివరి త్రో లో 82.89 మీటర్లు నమోదు చేశాడు.
జెర్మనీ సూపర్ స్టార్ వెబర్ మొదటి త్రో 87.88 మీటర్లు మాత్రమే విసిరి 2వ స్థానంలో నిలిచాడు. థర్డ్ ప్లేస్ లో బ్రెజిల్ త్రోయర్ లూయిస్ మారిసియో డ సిల్వా నిలిచాడు. సెకండ్ అటెంప్ట్ లో 86.62 మీటర్లు విసిరాడు.
ఇటీవల దోహా డైమండ్ లీగ్ లో 90 మీటర్లు విసిరిన చోప్రా.. పారిస్ లో 88.16 మీటర్లకు పరితమైనప్పటికీ మొదటి స్థానాన్ని సాధించడంతో మెడల్ సంపాదించాడు. దోహాలో వెబర్ 91.06 మీటర్లు విసిరి ఫస్ట్ ప్లేస్ సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకోగా.. చోప్రా 2వ స్థానంలో నిలిచాడు. ఎట్టకేలకు పారిస్ లో దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వెబర్ ను ఓడించి బంగారు పథకాన్ని సాధించడం విశేషం.
NEERAJ CHOPRA WINS PARIS DIAMOND LEAGUE💎
— The Khel India (@TheKhelIndia) June 20, 2025
- The best attempt of 88.16m in first throw 🔥🤩 pic.twitter.com/dhYVQPUr5E