కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్సే గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తన తమ్ముడు గొటాభయా రాజపక్సే ప్రెసిడెంట్గా ఎన్నికైన కొద్ది రోజులకే మహింద కూడా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో లంకలో రాజపక్సే కుటుంబం రాజకీయంగా బాగా బలపడినట్టే అని విశ్లేషకులు చెప్పారు. వచ్చే ఆగస్టులో జరిగే జనరల్ ఎలక్షన్స్ వరకు మహింద రాజపక్సే కేబినెట్ కేర్టేకర్గా ఉంటారు. లంక మాజీ ప్రధాని రనీల్ విక్రమ సింఘే, మాజీ ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన, ప్రముఖ రాజకీయనాయకులు ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు.