ఇటీవల ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం వరల్డ్ విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ( నవంబర్ 7 ) సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఇండియన్ ఉమెన్ క్రికెటర్స్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సీఎం చంద్రబాబును కలిశారు. ఉమెన్ ఛాంపియన్స్ కు స్వగతం పలికారు మంత్రి నారా లోకేష్. వరల్డ్ కప్ గెలుచుకున్న సందర్భంగా శ్రీచరణిని అభినందించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
శ్రీచరణి, మిథాలి రాజ్లతో సమావేశమైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనందక్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్తో పంచుకున్నారు శ్రీచరణి. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు సీఎం చంద్రబాబు.
ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీచరణికి ఘన స్వాగతం పలికారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు.
