
ఐపీఎల్ 2025 ట్రోఫీని ఒక కొత్త జట్టు గెలవనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి టైటిల్ గెలుచుకొని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరుకున్నాయి. దీంతో ఈ సారి ఒక కొత్త జట్టును ఐపీఎల్ టైటిల్ విన్నర్ గా చూడబోతున్నాం. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ బ్లాక్ బస్టర్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఏ జట్టు గెలిచినా చరిత్ర సృష్టిస్తుంది. అదే సమయంలో ఏ జట్టు ఓడిపోయినా విపరీతమై బాధ తప్పదు. ఎందుకంటే 14 ఏళ్లుగా రెండు జట్లు ఐపీఎల్ టైటిల్ కోసం పోరాడుతూనే ఉన్నాయి.
ఈ బ్లాక్ బస్టర్ ఫైనల్ కు ముందు దర్శక ధీరుడు రాజమౌళి రెండు జట్ల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. రాజమౌళి ట్వీట్ లో ఈ విధంగా రాసి ఉంది. "శ్రేయాస్ అయ్యర్.. బుమ్రా, బోల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీ కొట్టడం అద్భుతంగా అనిపించింది. అయ్యర్ ఢిల్లీని ఐపీఎల్ ఫైనల్ కు చేర్చాడు. కానీ అతన్ని రిటైన్ చేసుకోలేదు. ఆ తర్వాత కోల్కతాకు టైటిల్ తీసుకొని వచ్చినా డ్రాప్ చేశారు. ఆ తర్వాత యంగ్ పంజాబ్ జట్టును 11 ఏళ్ళ తర్వాత ఫైనల్ కు తీసుకెళ్లాడు. ఈ సీజన్ లో ట్రోఫీ గెలవడానికి అయ్యర్ అర్హుడు.
మరోవైపు కోహ్లీ కొన్ని సంవత్సరాలుగా వేలకొద్ది పరుగులు చేస్తున్నాడు. అతని జట్టు ఫైనల్ కు వచ్చింది. కోహ్లీ ఐపీఎల్ టైటిల్ గెలవడానికి అర్హుడు. ఫలితం ఏదైనా ఇరు జట్లకు హార్ట్ బ్రేక్ కావడం గ్యారంటీ". అని రాజమౌళి తన ఎక్స్ ద్వారా తెలిపాడు. ఇరు జట్ల విషయానికి వస్తే క్వాలిఫయర్ 1 లో పంజాబ్ ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్ చేరుకుంది. ఆదివారం (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించి పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
“Whatever the result... It's going to be a heartbreak...” - SS Rajamouli's tweet ahead of the IPL Final ✍🏻 pic.twitter.com/QOJ6J5pGKa
— CricketGully (@thecricketgully) June 2, 2025