10న రాష్ట్ర కేబినెట్ సమావేశం

10న రాష్ట్ర కేబినెట్ సమావేశం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 10న మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్‌‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు, సొంత జాగలున్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా డిసెంబర్ రెండో వారంలోనే ఉంటాయన్న చర్చ జరుగుతోంది.