దండు మారెమ్మ బో నాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

దండు మారెమ్మ బో నాల ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

సికింద్రాబాద్: రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, పాడి పంటలతో చల్లగా ఉండాలని దండు మారెమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు రాష్ట్ర కార్మిక మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కంటోన్మెంట్ నియోజకవర్గంలోని దండు మారెమ్మ ఆలయంలో జరిగిన బోనాలు పండగకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి... అనంతరం బంగారు బోనాన్ని ఎత్తుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అంతకు ముందు బోయిన్ పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి క్యాంపు పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ... బోనాల పండుగ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శమన్నారు. ఇలాంటి పండుగల వల్ల ప్రజల మధ్య ఐక్యతా భావం పెరిగి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారని చెప్పారు. దోమల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కుటుంబ సమేతంగా ఎవరి ఇంటి పరిసరాలను వారే శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం కావడంతో ఇళ్లల్లో నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే దోమలు పెరిగి టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు.