మునిగే నావ ఎవరిదో తేలుస్తాం: భట్టి

మునిగే నావ ఎవరిదో తేలుస్తాం: భట్టి

మంత్రి కేటీఆర్…కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మాట్లాడిన కేటీఆర్..కాంగ్రెస్ మునిగే నావ అన్నారు. దీనిపై మాట్లాడిన భట్టి..మునిగే నావ ఎవరిదో త్వరలోనే తెలుస్తామన్నారు. రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళను లేకుండా చేసి ఇష్టారాజ్యంగా పాలించాలనుకుంటున్నారని ఆరోపించారు. హుజూర్ నగర్లో CPI కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారన్న భట్టి ఆరేళ్ళ మీ పాలనలో రాష్ట్రాన్ని దివాళా తీయించారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని వదిలించుకోకపోతే తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోక తప్పదన్నారు భట్టి.